చిగురుమామిడి, సిరా న్యూస్
ఓటరు నమోదు, సవరణల కోసం ప్రత్యేక క్యాంపెయిన్
ఓటరు నమోదు, సవరణల క్యాంపెయిన్ ను సద్వినియోగం చేసుకోవాలని చిగురుమామిడి తహసీల్దార్ ఇప్ప నరేందర్ అభిప్రాయపడ్డారు. శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో నిర్వహించిన కొత్త ఓటరు నమోదు, సవరణల కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని కోరారు. మండల వ్యాప్తంగా 17 గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటుహక్కు, సవరణల కోసం పంచాయతీల్లో ఉన్న బీఎల్ వోలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆదివారం కూడా పని దినమే అని సూచించారు.