Jai Sri Ram; రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా భక్తిభావంతో ఉండాలి

నిర్మల్, సిరా న్యూస్ 

రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు సోమవారం అందరు భక్తి శ్రద్ధలతో ఉండాలని హిందూ సంఘం నాయకులు కోరారు. రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఇంటింటికి స్టిక్కర్లు, జెండాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాముడి మీద భక్తితో మద్యం, మాంసానికి దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఇంటిలో భక్తి భావం పెరగాలన్నారు. అయోధ్య రాముడికి మనం అందించే భక్తిభావం మనకు మేలు కలిగిస్తుందని పేర్కన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *