నిర్మల్, సిరా న్యూస్
రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు సోమవారం అందరు భక్తి శ్రద్ధలతో ఉండాలని హిందూ సంఘం నాయకులు కోరారు. రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఇంటింటికి స్టిక్కర్లు, జెండాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాముడి మీద భక్తితో మద్యం, మాంసానికి దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఇంటిలో భక్తి భావం పెరగాలన్నారు. అయోధ్య రాముడికి మనం అందించే భక్తిభావం మనకు మేలు కలిగిస్తుందని పేర్కన్నారు.