పెంబి, సిరా న్యూస్
రెడ్డి బిజినెస్ గ్రూప్ డైరీ ఆవిష్కరణ
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో రెడ్డి బిజినెస్ గ్రూప్ డైరీని సంఘం సభ్యులు ఆవిష్కరించారు. వివిధ రకాల వ్యాపారాలు, వ్యాపారస్తుల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలతో కూడిన డైరీలను ఈ సందర్భంగా పలువురికి పంపిణీ చేశారు. అనంతరం రెడ్డి బిజినెస్ గ్రూప్ రాష్ట్ర డైరెక్టర్ రాంరెడ్డి మాట్లాడుతూ… రెడ్డిలంతా ఐక్యంగా ఉంటూ వ్యాపారాల్లో రాణించాలని అన్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ వ్యాపార సంబంధ విషయాల్లో సలహాలు, సూచనలు పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది సల్ల ప్రశాంత్ రెడ్డి, తార్లపాడ్ సర్పంచ్ శేఖర్ రెడ్డి, జగిత్యాల జిల్లాకు చెందిన తిరుపతి రెడ్డి, తుర్క విజయ్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.