God Ramudu: బాలరాముడి ప్రాణప్రతిష్టకు మద్దతుగా శోభాయాత్ర

లోకేశ్వరం, సిరా న్యూస్ 

ప్రతి గ్రామంలో శోభాయాత్ర 

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గ్రామాల్లో శోభాయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణప్రతిష్ట కు మద్దతుగా తమ గ్రామాల్లో శోభాయాత్రలు నిర్వహించి దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో ప్రతి ఊళ్లో ఊరేగింపులు నిర్వమించారు. పండుగ వాతావరణం కనిపించింది. ఆధ్యాత్మికత వెల్లువిరిచింది. ప్రతి ఒక్కరు శోభా యాత్రలో పాల్గొని రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. తమ గ్రామాల్లో సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *