మల్లన్న ను దర్శించుకున్న పురంధేశ్వరి

                                                                             సిరా న్యూస్,శ్రీ శైలం;
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం నాడు శ్రీ శైలం మల్లిఖార్జున స్వామి ని దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మల్లిఖార్జున స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు.
స్వామి ఆశీస్సులు, భ్రమరాంబ అమ్మ వారి చల్లని దీవెన లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండాలని కోరుకున్నానని అన్నారు. ఈరోజు దేశప్రజలు కు అధ్బుతమైన రోజు గా పేర్కొన్నారు. దేశ మంతారామమయంఅయింది. బాలరాముడు విగ్రహం ప్రాణ ప్రతిష్ట రోజు న మల్లన్న సన్నిధిలో ఉండడం అదృష్టం గా భావిస్తున్నాను. శతాబ్దాల కల అయోధ్య రాముడు ఆలయం. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విగ్రహం ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని అందరూ టివీ మాధ్యమం గా వీక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఆమె వెంట బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *