సిరా న్యూస్,హైదరాబాద్;
కుత్బుల్లాపూర్ అయోధ్య శ్రీరామ జన్మభూమి భవ్య మందిరంలో శ్రీ బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, కుత్బుల్లాపూర్ వాడవాడలో శ్రీరాముని విగ్రహాలకు పూజలు అన్నదాన కార్యక్రమాలు జరిపించారు. జగద్గిరిగుట్ట బస్టాండులో ఎల్ఈడి లో రాముని యొక్క చరిత్ర చూపెడుతూ పెద్ద ఎత్తున భక్తులు పూజలు నిర్వహించారు. భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. హోమములు నిర్వహించారు, శ్రీరాములవారు సీతాదేవి లక్ష్మణుడు హనుమాన్ వేషాధనలో వేసి భక్తులను ఆనందింపజేశారు పాటలలో మునిగితేలారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని డాన్స్ లేస్తూ భక్తి పరవశంలో మునిగిపోయారు.