సిరా న్యూస్,విశాఖపట్నం;
అయోధ్యలో సీతారాముల ప్రాణ ప్రతిష్టపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. భారతావని గర్వించదగ్గ రోజు ఇది. కోట్లాది మంది కీర్తిస్తుండగా అయోధ్యలో సీతారాముల ప్రాణ ప్రతిష్ట జరగడం ఆనందదాయకం. ప్రధాని మోడీ మరో శంకరాచార్యునిగా, వివేకానందుడిలా చరిత్రలో నిలుస్తారు. యావత్ భారతావని మోడీకి రుణపడి ఉంటుంది. అయోధ్య కార్యక్రమం ద్వారా భారతదేశానికి ఎనలేని కీర్తి సంపాదించిందని అన్నారు