రామ్‌లల్లాకు  ప్రధాని మోదీ.. సాష్టాంగ నమస్కారం

సిరా న్యూస్,అయోధ్యా ;
వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యాపురిలో రాముడి దర్శనభాగ్యం సాక్షాత్కారమైంది. శ్రీ రామ జన్మభూమి లో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుదీరాడు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో గర్భగుడిలో రామ్‌లల్లాను ప్రధాని కొలువుదీర్చారు. ప్రాణప్రతిష్ట ముగిశాక రామయ్య చరణాలకు పద్మాలను సమర్పించిన ప్రధాని మోదీ.. సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రాణప్రతిష్ట నేపథ్యంలో రామనామ స్మరణలతో అయోధ్యాపురి పులకించిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *