ఏసీబీ నిఘా పెట్టిందని సమాచారం
సిరా న్యూస్,వేములవాడ;
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది లో టెన్షన్ నెలకొంది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు దాదాపు 30 మంది ఆలయ ఉద్యోగులపై ఏసీబీ నిఘా పెట్టినట్లు వార్తలు రావడంతో కలవరం మొదలయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనీ ఆలయ ఉద్యోగులు భయపడుతున్నారు. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. ఏఈఓ స్థాయి నుండి జూనియర్ అసిస్టెంట్ వరకు వెటు పడే అవకాశం వుందని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు