ఆదిలాబాద్, సిరా న్యూస్
భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రికి కేంద్ర ప్రభుత్వం ఎన్.హెచ్.ఎం పథకంలో భాగంగా రూ.23.75 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఆరోగ్య సేవలు మరింత విస్తృతపరచడానికి అవసరమైన ఆసుపత్రులు భవనాలు నిర్మిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిలో సిబ్బందిని నియమించి ఆరోగ్య సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ, జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్కతో విన్నవించడం జరిగిందని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన జిల్లా కోసం ప్రధాని నరేంద్ర మోదీ విశేష కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.