సిరా న్యూస్,హైదరాబాద్;
పద్మవిభూషణ్ అవార్డు కు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి అభినందించారు.మంత్రి మాట్లాడుతూ పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం రేపటి విశ్వంభరదాక విజయవంతంగా సాగుతుంది. వారు రక్తదానం, నేత్రదానం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. చిరంజీవిరిని ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా అయనకు వారికి నా తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలని అన్నారు.