రాజన్న సన్నిధిలో ప్రారంభమయిన శివదీక్షలు

 సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. శివ స్వాముల ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయ మార్మోగింది ఆలయంలోని అభిషేక మండపంలో లో ఆలయ ప్రధాన అర్చకులు అధ్వర్వంలో దాదపు 300 మంది శివ భక్తులు శివుడి మాలధారణ ధరించారు. నుదుటన, విభూతి కుంకుమ ధరించిన శివ స్వాములకు అర్చకులు రుద్రాక్ష శివ మాల ధారణ వేశారు
..ప్రతి యేట శివరాత్రి ముందు శివుడి మలధారణ చేసి, శివరాత్రి నాడు లింగొధ్బవ సమయంలో మాల విరమణ చేస్తారు..
అయితే దాదాపు 32 సంవత్సరాల నుండి ప్రతియేటా శివుడి మాల వేసుకోవడం అనవాయితీగా వస్తుంది.
మానవుడు భగవత్ దీక్ష కలిగియుంటే అరిష్టాలు తొలిగి, సిరి సంపదలు, సుఖ సంతోషాలు కల్గుతాయని భక్తుల విశ్వాసం…దీక్ష్ ల్లో అత్యుత్తమైనది శివ దీక్ష, లయకారుడైనా శివుడిని రూపం ధరిస్తే మోక్షం కల్గుతుందని భక్తుల నమ్మకం.. అందుకే శుభకరుడైన మహశివుడిని భక్తులు కొలుస్తారు.. శ్రీశైలంలో మొదలైనా శివదీక్షలు, వేములవాడ వరకు విస్తరించాయి, దీక్షల్లో అత్యుత్తమైనది శివధీక్ష… మహశివరాత్రి వరకు 41 రోజుల పాటు శివమాస ధరిస్తారు..ప్రతి రోజు సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ప్రతి రోజు కఠిన నియామాలతో శివుడిని పూజిస్తు. కఠిక నేలపై నిద్రిస్తారు.. వీటిలో శివ దీక్షలు మహామండలం 108 రోజు, మండల దీక్ష 41 రోజులు, అర్థమండల దీక్ష 21 రోజులు ధరిస్తారు.. శివమాల ధరించే స్వాములు కఠిన నియమాలు పాటిస్తారు.. తప్పని సరిగా శివుడికి అభిషేకం చేసిన తర్వాతనే లింగం ధరించిన స్వాములు మాలలు వేస్తారు.. చందన వర్ణం వస్ర్తాలను ధరించి, నుదుట విభూతి, కుంకుమ చందనం, మెడలో రుద్రక్షమాల ధరిస్తారు. దీక్ష సమయంలో మంచి నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని ఆర్చకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *