చిగురుమామిడి, సిరా న్యూస్
రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని పలువురు నేతలు అబిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్ర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, అంబేద్కర్ సంఘం,గౌడ సంఘం, రైతు వేదిక, మహిళా సంఘం, పురుషుల పొదుపు సంఘం, కరీంనగర్ పాల డెయిరీ, ముల్కనూరు పాల డెయిరీ, విస్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, తాపీ కార్మిక సంఘం, అంబేద్కర్ విగ్రహం వద్ద , వివిధ కుల సంఘాలు జాతీయ జెండాను ఎగురవేసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 26 జనవరి అంటే దేశ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యమని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం ద్వారా వెనుకబడ్డ వర్గాలకు విముక్తి దొరికిందని రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కృషి ఎంతగానో ఉందని తెలిపారు. రాజ్యాంగ రక్షణ కోసం పాటుపడాలని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.