సిరా న్యూస్,విజయవాడ;
75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.తదుపరి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
ఈకార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ డా.పిపిపికె. రామాచార్యులు,ఉప కార్యదర్శులు సుబ్బరాజు,చీఫ్ మార్షల్ డి.ఏడుకొండల రెడ్డి, లీగల్ అడ్వయిజర్ ఎం.చంద్రశేఖర్,ఇతర అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.