Boath Court Judge B Hussain: చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి…

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి…

– జడ్జి బి హుస్సేన్

– బూతాయి లో చట్టాల పై అవగాహన కార్యక్రమం

– జడ్జిని ఘనంగా సన్మానించిన గ్రామస్తులు

గ్రామస్తులంతా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బోథ్ కోర్టు జడ్జి బి హుస్సేన్ సూచించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని బూతాయి గ్రామంలో బోథ్ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జడ్జి బి హుస్సేన్ మాట్లాడుతూ…. గ్రామస్తులు గుడుంబా, గంజాయి సాగు చేయకుండా గ్రామంలో కేసులు లేకుండా చూడాలన్నారు. బూతాయి గ్రామాన్ని గుడుంబా, గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. మోటారు వెహికిల్ చట్టాలు, బాల్యవివాహాల నిరోధక చట్టం, విద్యాహక్కు చట్టం, లోక్ ఆదాలత్ ల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం జడ్జి ని గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాడ్ నేనేశ్వర్, బోథ్ బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్, న్యాయవాది దమ్మాపాల్, ఎట్టం రాములు, ఎక్సజ్ సిఐ రాజమౌళి, ఏఎస్ఐ ధారసింగ్ రాజేశ్వర్ ఉప సర్పంచ్ సంతోష్, నాయకులు ముండే ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *