Khanapur MLA Vedma Bojju: కార్యకర్తలకు అండగా ఉంటాం…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

కార్యకర్తలకు అండగా ఉంటాం…

– ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్

పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శనివారం పెంబి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషిచేసిన కార్యకర్తలు, నాయకులను ఆయన అభినందించారు. తాను కూడా చిన్న కార్యకర్త స్థాయి నుండి నేడు ఎమ్మెల్యేగా ఎదిగానని, తనకు కార్యకర్తల కష్టాలు తెలుసని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో రానున్న ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయానంద్, పెంబి మండల అధ్యక్షులు సల్ల స్వప్నిల్ రెడ్డి, నాయకులు సల్ల ప్రశాంత్ రెడ్డి, రాజురా సత్యం, అశోక్ రావు, తులాల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *