చంద్రబాబు తోనే మెరుగైన భవిష్యత్తు..     భారీ బైక్ ర్యాలీ లో వంతాల నాగేశ్వరరావు.

అరకులోయ,(సిరా న్యూస్);
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తోనే భావితరాలకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని అరకు పార్లమెంటు కోశాధికారి వంతాల నాగేశ్వరరావు అన్నారు.తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి  శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రోజున కించుమండ  పరిధిలోనుండి  అరకులోయ పట్టణంలో వరకు ఆరు మండలాలు కార్యకర్తలు నాయకులు కలిసి అరకు పార్లమెంట్ కోశాధికారి వంతాల   నాగేశ్వరరావు మాజీ మంత్రి శ్రావణ్ కుమార్  ఆద్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు కు గ్యారెంటీ అనే కార్యక్రమం ను తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మ్యానిఫెస్టో ను ప్రజలకు వివరిస్తూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రజలకు వివరించారు.తెలుగుదేశం పార్టీతోనే బడుగు,బలహీన వర్గాల సమాన అభివృద్ధి జరుగుతుందని వారు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *