సిరా న్యూస్, దండేపల్లి:
మతమార్పిడికి బలవంతం చేస్తున్న పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగపూర్ లో బలవంతపు మతమార్పిడిలకు పాల్పడుతున్నారని, నిరసించినందుకు పోలీసులతో కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి రిమాండ్ కు పంపిస్తున్నారని ఆరోపిస్తూ లింగపూర్ గ్రామస్తులు దండేపల్లి లో రాస్తారోకో నిర్వహించారు. లింగపూర్ దుబ్బలగూడెం కు చెందిన చర్చి పాస్టర్ సురేష్ కొంతమంది మహిళలు శనివారం నంది సుమ అనే మహిళ ఇంటికి వచ్చి నీ భర్త తాగుడుకు బానిస అవడానికి మంత్రాలు చేశారని నమ్మించారు. దెయ్యాలు, భూతాలు మీఇంటికి పట్టాయని మీరు మా మతంలోకి వస్తే ప్రార్థనలు చేసి నయం చేస్తామని నమ్మబలకారు. మతం మారమని బలవంతం చేయడంతో ఆదివారం ఉదయం ఆమె తన భర్త నంది నరేష్ కు చెప్పింది. కాగా చర్చి పాస్టర్ తమ ఇంటి ముందు నుంచి బైక్ పై వెళ్లుతుండగా నా భార్యను మత మార్పిడికి ఎందుకు బలవంతం చేస్తున్నారని నిలదీస్తుండగా మత మార్పిడికి బలవంతం చేసిన సోగాల రాజన్న, ఆస యశోద(ఆశ వర్కర్) సుద్దాల ఏసుమని, పడిదేం పుష్ప, సురిమిళ్ల సరిత , అమృత, దేవి ఉమ, చిటుమల్ల సరిత, ఆస చంద్రమ్మ, సోగాల స్వప్న గొడవకు దిగారు. నరేష్ తమ్ముడు నంది సురేష్ ఎందుకు గొడవ చేస్తున్నారని కలుగజేసుకున్నందుకు సురేష్ ను చితకబాదారు. అంతటితో ఆగక దండేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి నరేష్, సురేష్ లపై అక్రమ కేసు బనాయించి ఎలాంటి విచారణ చేయకుండా గొడవ జరిగిన రెండు గంటల లోపే ఎస్ఐ ప్రసాద్ అత్యుత్సాహంతో అరెస్ట్ చేసి రిమాండు కు తరలించారని నిరసిస్తూ సోమవారం బాధితుని భార్య నంది సుమ కుటుంబ సభ్యులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు.ఈ విషయమై స్థానిక తహసీల్దార్ సంధ్యారానికి, మంచిర్యాల ఏసీపీ కి దండేపల్లి ఎస్ఐ తీరు పట్ల ఫిర్యాదు చేశారు.