సిరా న్యూస్,హైదరాబాద్;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్టాఫ్ నర్సులు సోమవారం ఉదయం కలిసారు. 317 జీవో వల్ల చాలా నష్టపోయాం. ఈ ప్రభుత్వం రాగానే 317 సవరించి మా న్యాయం చేసి మా స్థానికతకు మమ్మల్ని పంపిస్తారని ఆశించాం. 7094 స్టాఫ్ నర్స్ పోస్టులు రిక్రూమెంట్ చేపట్టగా వారికి 31 తారీఖున సీఎం చేతుల మీదుగా ఎల్బీనగర్ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారని వారికి పోస్టులు కేటాయిస్తే మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే లోపు మా జిల్లాకు మమ్మల్ని పంపించాలని వారు కోరారు. సొంత జిల్లాకు మమ్మల్ని పంపించిన తర్వాత మాకు న్యాయం చేసిన తర్వాతే వారికి రిక్రూమెంట్ చేయాలని వారు కోరారు. ఈ విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లారు.