హజరయిన ఎంపి, ఎమ్మెల్యే
సిరా న్యూస్,పిఠాపురం;
గత ఎన్నికలముందు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఆర్ధికంగా అండగా నిలబడేందుకు వైఎస్సార్ ఆసరా పంపిణీ చేస్తున్నారని,ప్రతీ మహిళా ఈ ఆసరాను సద్వినియోగపరచుకోవాలని కాకినాడ ఎంపీ,వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతావిశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన పిఠాపురం మండల డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత,ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారావు,ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు,జడ్పీ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు,వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత,పలువురు మహిళా సర్పంచులు ప్రసంగించారు.అనంతరం మండలానికి సంబంధించి పదహారొందల డ్వాక్రా సంఘాలకు చెందిన పదహారువేలమంది సభ్యులకు సుమారు పదమూడున్నర కోట్ల రూపాయల నమూనా చెక్కును ఎంపీ వంగా గీతావిశ్వనాథ్,ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతులమీదుగా అందజేశారు..డ్వాక్రా సంఘాల మహిళలందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్నుద్దేశించి ఎంపీ వంగా గీతావిశ్వనాథ్,ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడారు..