లోకేశ్వరం, సిరా న్యూస్
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో యూరియా కొరత ఒకే లోడ్ రావడంతో రైతులు లైన్లో నిలబడ్డారు. రైతులకు యూరియా ఇవ్వకుండా ఇష్టం వచ్చిన వాళ్లకు ఇస్తున్నారని రైతులు వాపోయారు. ఇతర డీలర్లు మార్కెట్లో రేట్ రూ.270 యూరియా బస్తా ఉండగా డీలర్లు రూ. 3 10 లకు బస్తా ఇస్తున్నారు. రైతులను ఈ విధంగా దోచుకుంటున్నారని రైతులు వాపోయారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీరుగానే ఇప్పుడు యూరియా కొరత రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కొరతపై ప్రభుత్వం చర్యలు తీసుకుని కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.