కుందుర్తి, సిరా న్యూస్
ఉత్తమ అవార్డు పొందిన ఎస్సై కి ప్రజా ప్రతినిధులు సన్మానం చేశారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ ఎం గౌతమి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు పొందిన నూతన ఎస్ఐ టీపీ వెంకటస్వామికి స్థానిక వైసీపీ నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్ఐకి సన్మానం ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ రాధాస్వామి, కన్వీనర్ సత్యనారాయణ శాస్త్రి, ఎంపీపీ, కమల నాగరాజు, గ్రామ సర్పంచ్, మారుతీశ్వర రామ్మూర్తి, మహంతపురం గ్రామ సర్పంచ్, మసాలా జగన్, మాజీ జెడ్పీటీసీ రాజగోపాల్ మాట్లాడారు. ఎస్ఐ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పేద ప్రజలకు వెంటనే న్యాయం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు.