బేల, సిరా న్యూస్
పీహెచ్ డీ పట్టా పొందిన గిరిజన టీచర్ కు సన్మానం
ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ పట్టా పొందిన గెడం ప్రవీణ్ కి ఘన సన్మానం జరిగింది. స్థానిక కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ముఖ్య అతిథిగా జిల్లా స్పోర్ట్స్ ఆదారిటీ అధికారి కోరెడ్డి పార్థసారథి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సూర్య ప్రకాష్, ప్రముఖ విద్యా వేత్త ఊదారి నారాయణ, మాజీ ప్రిన్సిపాల్ కన్నం మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోరెడ్డి పార్థసారధి మాట్లాడుతూ సామాన్య గిరిజన కుటుంబం నుంచి పీహెచ్ డీ చేయడం గొప్ప విషయం అన్నారు. ప్రవీణ్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్ రావు, అధ్యాపకులు ఆమోల్ కిష్ట రెడ్డి, సాగర్, బిందు, పుష్ప, సంజీవ్, సౌందర్య, విజయ, ప్రియాంక పాల్గొన్నారు