పెద్దవెంతర్ల గ్రామంలో నూతన సచివాలయం

ప్రారంభించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి…

 సిరా న్యూస్,కొలిమిగుండ్ల,
కొలిమిగుండ్ల మండలంలోని పెద్ద వెంతుర్ల గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కలిసి సచివాలయాన్ని ప్రారంభించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డికి గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, ఎం వి కొండారెడ్డి, ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు కలిసి పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ పేరు సోమల నుండి కొలిమిగుండ్ల వరకు నూతనంగా రోడ్డు వేయిస్తామని ఆయన బహిరంగ సభలో ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కిందని రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలు వైయస్సార్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అంబటి గురివిరెడ్డి, లాయర్ మహేశ్వర్ రెడ్డి, కోటపాడు ఈశ్వర్ రెడ్డి,పేరం నందకిషోర్ రెడ్డి, పేరం సూర్యనారాయణ రెడ్డి, పేరం నాగేందర్ రెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి, ఎర్రగుడి సర్పంచ్ కంబగిరి స్వామి, నందిపాడు గురెడ్డి, ఉప్పులూరు కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, ఇటిక్యాల శేఖర్ రెడ్డి, నారాయణరెడ్డి, పులి ప్రకాష్ రెడ్డి, తోట మల్లేశ్వర్ రెడ్డి, మొలక రాజారెడ్డి, సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, కుమార్, బాబ్జి, నరసింహులు, ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *