ఆదిలాబాద్, సిరా న్యూస్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల వాసి ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనను శాలువాతో సన్మానించారు. జిల్లా లోని పలు సమస్యలను సత్వరమే పరిష్కార మార్గాలను చూపాలని అన్నారు. జిల్లా పురోగమనానికి సహకరించాలని కోరారు. ఈ ప్రాంత వాసిగా ఇక్కడి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ జిల్లాలోని సమస్యలను చూపితే తప్పకుండా వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తానని చెప్పారు.