ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సర్పంచ్ ల నిరసన దిక్ష

 సిరా న్యూస్,పరవాడ;
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదురుగా జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు చింతకాయల సూజాత ముత్యాలు అధ్యక్షతన జరిగిన సర్పంచ్ ల నిరసన దిక్ష లో ముఖ్యఅతిథి గా రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మి ముత్యాలరావు హాజరై రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల నాణ్యమైన 16 డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నిరసన దిక్షకి హాజరైన సర్పంచ్ లకు ధన్యవాదాలు తెలియజేస్తూ చింతకాయల సూజాత ముత్యాలు ఒక ప్రతిక ప్రకటన విడుదల జేశారు.
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా 73,74 రాజ్యంగ సవరణ లోని ఆర్టికల్ 243g 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 ,ఆంశాలలోని ,నిధులు ,విధులు ,ఆధికారలను తక్షణమే ఇవ్వలని డిమాండ్ చేశారు .
గ్రామ పంచాయతీకి రావలసిన ,రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన 8629 కోట్లు రూపాయలు నిధులను తక్షణమే గ్రామ పంచాయతీ ఖాతాలోకి జమ చేయాలని డిమాండ్ చేశారు .స్థానిక సంస్థలకు రావలసిన నిధులు మంజూరు చేయకపోతే వచ్చే ఎన్నికలలో వైసీపి ప్రభుత్వానికి మా తడఖా చూపిస్తామని హెచ్చరించారు .
ఈ నిరసన కార్యక్రమం లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గల సర్పంచ్ లు ,ఉప సర్పంచ్ లు ,ఎంపిటీసి లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *