సిరా న్యూస్,గుడివాడ;
గుడివాడ రాజబాపయ్య చౌక్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు అక్కడ – ‘సై’ పేరుతో ఉదయం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. వాటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది వచ్చారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి టీడీపీ, జనసేన నాయకులు వెళ్లారు.
టీడీపీ శ్రేణులు రావడంతో మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరువాత టీడీపీ, జనసేన నాయకులు ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ర్యాలీని డీఎస్పీ శ్రీకాంత్ అడ్డుకున్నారు. డీఎస్పీ, టీడీపీ-జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.