Employees : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఖానాపూర్, సిరా న్యూస్ 

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జును ఐఎన్ టీయసీ అనుంబంధ సంఘాల తరఫున మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న సమస్యలను వివరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రిమ్స్ లో నియమించిన పాత వారిని జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 142 జీవోను కూడా రద్దు చేయాలని పేర్కొన్నారు. కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వేయాలని అన్నారు. వారి సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సత్యనారాయణ రావు, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్ల రవీందర్, ముఖ్య సలహాదారు రాథోడ్ బాబూలాల్, సభ్యులు బొమ్మెత సుభాష్, బలరాలం, సంతోష్, ప్రవీణ్, ఉట్నూర్ డివిజన కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *