భీమదేవరపల్లి, సిరాన్యూస్:
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ జక్కుల అనిత ఆధ్వర్యంలో సర్పంచుల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 22 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,కార్యదర్శులు, పాల్గొని, ఐదు సంవత్సరాల గ్రామాల అభివృద్ధి పై, అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. తహసీల్లార్ భాస్కర్, ఎంపీడీవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.