సిరా న్యూస్,రామచంద్రపురం;
ద్రాక్షారామంలో గతసంవత్సరం మూసివేసిన ఎస్పివిఆర్ హైస్కూల్ తిరిగి తెరవాలని అందులో చదువుకున్న పూర్వ విద్యార్థులు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఈరోజు ద్రాక్షారామ బోసు బొమ్మ సెంటర్లో దీక్ష చేపట్టారు. దీనికి మద్దతుగా వ్యాపార సంస్థలు విద్యాసంస్థలు అన్ని స్వచ్ఛందంగా మూసివేసి బందుకు మద్దతు ప్రకటించారు. గతంలో స్కూలు తెరవాలని పోరాడిన వారిపై నమోదయిన కేసులు ఉపసంహరించాలని అందోళనకారులు డిమాండ్ చేసారు.