సిరా న్యూస్,హైదరాబాద్;
పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసులందరిని మూకుమ్మడిగా బదిలీ చేసారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. ఎస్హెచ్వో, ఎస్సైలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ ల వరకు మొత్తం సిబ్బంది ని బదిలీ చేసారు.
అక్కడ పనిచేస్తున్న మొత్తం 85 మందిపై బదిలీవేటు పడింది. వారిని అర్ముడు రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్లో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారు. బదిలీలతో పంజాగుట్ట పీఎస్ ఖాళీ అవడంతో..ఇతర స్టేషన్ల నుంచి 82 మంది కొత్త సిబ్బందిని నియమించారు. పంజాగుట్ట పోలీసులపై ముందు నుంచీ పలు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. . బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలు బయటకు పొక్కడంపై హైదరాబాద్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ఇనస్పెక్టర్ దుర్గారావు పై కేసు నమోదు కావడం అయన పరారీలో వుండడం తెలిసిందే.