సిరా న్యూస్,మదనపల్లి
బెంగళూరు రోడ్డులోని టీచర్స్ కాలనీలో బుధవారం ఉదయం ఉరి వేసుకుని ఓ మహిళ బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన వెలుగు చూసింది.టీచర్స్ కాలనీలో కాపురం ఉంటున్న చంద్రశేఖర్ భార్య విద్యారాణి (45) క్షనికావేశంలో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు పరీక్షించిన ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు తెలిపారు.తాలూకా సిఐ ఎన్.శేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.