భర్త రెండవ వివాహం చేసుకున్నాడని భార్య ఆత్మహత్య

మైలార్ దేవ్ పల్లి లక్ష్మీ గూడ లో ఘటన
సిరా న్యూస్,రంగారెడ్డి;
భర్త రెండవ వివాహం చేసుకున్నాడని భార్య వేణుదేవి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన గది లో ఆత్మహత్య చేసుకుంది. తను ఉండగా భర్త ధర్మేంద్ర రెండవ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన భర్త తనకు కాకుండా పోతున్నాడని తీవ్ర మనస్తాపం చెందింది. ఆ భయం తోనే ఆత్మహత్య కు పాల్పడింది. స్థానికులు 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *