నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు

 సిరా న్యూస్,నెల్లూరు;
ఏపీలో గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సర్వర్లు మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పనులు ఆగిపోయాయంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. కాసేపు రిజిస్ట్రేషన్లు జరుగుతూ, మరి కాసేపు నిలుస్తూ మందకొడిగా సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో అప్లికేషన్ ఓపెన్ కాకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు కదలడంలేదని ఉద్యోగులు అంటున్నారు. అయితే గత రెండు కాస్త పనిచేసిన సర్వర్లు ఇవాళ పూర్తిగా షట్‌డౌన్‌ అయ్యాయి. సర్వర్లు షట్‌డౌన్‌ కావడంతో రిజిస్ట్రేషన్‌ సేవలకు నిలిచిపోయాయి. సాంకేతక సమస్యలపై పై అధికారులకు మెయిల్స్ పంపుతున్నామని ఉద్యోగులు అంటున్నారు. వారం నుంచి ఇలాంటి సమస్యలే వస్తున్నాయని, రిజిస్ట్రేషన్లు జరగడంలేదని ప్రజలు అంటున్నారు. 100 రిజిస్ట్రేషన్లు జరిగే ఆఫీసుల్లో కేవలం 30 వరకే జరిగే పరిస్థితి నెలకొందన్నారు. సర్వర్ల సాంకేతి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఏపీ సర్కార్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 రకాల సేవలను అందిస్తున్నారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా సేవలందిస్తున్నాయి. ఈ నెల 27 నుంచి నవరత్నాల్లో భాగంగా జగనన్న శాశ్వత స్థల హక్కు పథకం ద్వారా పేదలకు ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు చేస్తున్నట్లు సీఎస్ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.మరో నెల రోజుల్లో వివాహ ముహూర్తాలు మొదలవుతాయి. వరుసగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ల ఫీజులను ఏపీ ప్రభుత్వం సవరించింది. వివాహాల నమోదుకు సంబంధించి ఫీజులను పెంచుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200 ఉండగా, దానిని రూ.500కు పెంచింది. వివాహ వేదిక వద్దకు సబ్ రిజిస్ట్రార్ వస్తే ఇప్పటివరకు ఉన్న రూ.210 ఫీజును అమాంతం రూ.5 వేలకు పెంచింది. ప్రస్తుత ఏడాదిలో వివాహాల రికార్డుల పరిశీలనకు రూపాయిగా ఉన్న ఫీజును రూ.100లకు పెంచింది. సెలవు రోజుల్లో వివాహాల నమోదుకు ఫీజును రూ.5 వేలు చేసింది. ఇందుకు గానూ 1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టానికి సంబంధించి 1965లో జారీచేసిన ఫీజులను సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజులు పెంచినప్పటికీ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్లను మరింత సులభం చేస్తున్నట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌ కోసం ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *