Sama Rupesh Reddy: క్షతగాత్రులకు అండగా సామ రూపేష్ రెడ్డి

బేల, సిరా న్యూస్:

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గణేష్ పూర్ కు చెందిన ఆటో సోన్ కాస్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ గణేష్ పూర్ వంతెన వద్ద ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తన్న పది మందిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గణేష్ పూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ మాడవి సీత బాయితో పాటు ఇద్దరు మహిళలు మడవి సీతాబాయి, కొడప అయ్యబాయి గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం రాత్రి ఒంటి గంటకు జరగడంతో ఎవరు అందుబాటులో లేకుండాపోయారు. విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి దగ్గరుండి వారిని ఆస్పత్రికి పంపించి వైద్య సేవలు అందేలా చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *