దరఖాస్తులు స్వీకరిస్తున్న కాంగ్రెస్

 సిరా న్యూస్,హైదరాబాద్;
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ అప్లికేషన్లు ఆహ్వానించింది. ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లను స్వీకరించనుంది. ఇందుకోసం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీ,దివ్యంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 25 వేలుగా నిర్ణయించింది. ఇక మిగిలిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 50,000గా పార్టీ నిర్ణయించింది. అప్లికేషన్ ఫీజు మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలని అభ్యర్థులకు పార్టీ సూచించింది. దరఖాస్తు ఫార్మ్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయని గాంధీ భవాన్ సిబ్బంది ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అవలంబించింది. ఇప్పుడు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తోంది. తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలు ఉండగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి 2019 ఎన్నికలో మల్కాజిగిరి నుంచి….నల్గొండ నుంచి ఉత్తమ కుమార్ రెడ్డి, అలాగే భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నాలుగు సీట్లు దక్కించుకుంది. కాగా ఈసారి లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.అప్లికేషన్ ఫామ్ లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల ముందు పార్టీ 17 డిక్లరేషన్ లను పెట్టింది. “పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించని పక్షంలో పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయనని డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. అలాగే నేను కట్నం తీసుకోను, ఇవ్వను అని, హింసకు తావివ్వకుండా, స్త్రీల గౌరవాన్ని నిలబెడతానని పార్టీ ప్రోటోకాల్ పాటించడంతో పాటు మత, కుల రాజకీయ సంస్థలతో అనుబంధం కలిగి ఉండనని, కులమత భావాలను ప్రోత్సహించే ఇలాంటి సమావేశాలకు హాజరుకానని డిక్లరేషన్ ఇవ్వాలని అభ్యర్థులను కోరింది. ఏ క్రిమినల్ ఎలిమెంట్ తోనూ ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండనని, ఎన్నికల తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో ఆస్తి రిటర్న్ లు, ప్రతి సంవత్సరం ఆస్తులు వివరాలను సమర్పిస్తానని తదితర అంశాలపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. అలాగే ఏఐసీసీ, వర్కింగ్ కమిటీ లేదా సెంట్రల్ పార్లమెంట్ బోర్డు ద్వారా నిర్దేశించిన ఆదేశాలను అనుసరించడంతో పాటు పార్టీ జారీ చేసే విప్ లను పాటిస్తానని సంతకంతో ప్రతిజ్ఞ చేస్తున్నట్లు సంతకం చేసి అప్లికేషన్ ఇవ్వాలని ఆశావహులను కోరింది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సభ సెంటిమెంట్ గా మారింది. గతంలో దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులుగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *