సిరా న్యూస్,హనుమాన్ జంక్షన్ :
గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ గురువారం బాపుల పాడు మండలంలో పర్యటించి పలువురిని పరామర్శించారు. వీరవల్లి గ్రామ ప్రముఖులు, సొసైటీ అధ్యక్షులు గా పనిచేసిన లంక బాబు సురేంద్ర మోహన్ బెనర్జీ సతీమణి జానకీ రత్నం డిసెంబర్ 26 న మరణించారు. ఎమ్మెల్యే వంశీ సురేంద్ర బాబు ను గురువారం పరామర్శించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మరణం తీరని లోటని అన్నారు. ఎమ్మెల్యే వంశీ తో పాటు ఒలుపల్లి రంగా రావు, గూడపాటి సుధాకర్. రాయి గోపాలకృష్ణ, మోర్ల ఆంజనేయులు తదితరులు ఉన్నారు.