శ్రేణులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం కొట్టు
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావం పూరిస్తూ వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం బహిరంగ సభ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈనెల మూడో తేదీ శనివారం జరగనుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి సిద్ధానికి సన్నద్ధమవుతూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గురువారం కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. దీనికి ఏలూరు నుంచి పార్టీ సీనియర్ నాయకులు ఘంటా ప్రసాద రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలిచేలా పక్కా ప్రణాళికలు రూపొందించారని, దానికి అనుగుణంగా మనమంతా పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభకు జనం ఉప్పెనల లక్షల్లో తరలి వచ్చారని, ఆ సభ విజయవంతం కావడంతో ప్రతిపక్ష పార్టీలకు దడ పట్టుకుందన్నారు. ఈ నెల మూడో తేదీన ఏలూరులో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి సిద్ధం సభ జరుగుతోందన్నారు. దీనికి మన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరై శ్రేణులను ఉత్తేజ పరచడంతో పాటు ప్రజలకు సందేశం ఇస్తారన్నారు. సిద్ధం సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు తరలి రావాలని పిలుపునిచ్చారు. దీనికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా అనుసరించవలసిన పలు అంశాలపై సూచనలు చేశారు. వైకాపా జిల్లా సీనియర్ నాయకులు ఘంటా ప్రసాద రావు మాట్లాడుతూ ఏలూరులో జరగనున్న సిద్ధం సభకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి విశేషమైన స్పందన కనిపిస్తుంది అన్నారు. తమ అంచనాలకు మించి సిద్ధం సభకు తరలిరావడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు మంత్రి కొట్టు సారధ్యంలో చేస్తున్నామన్నారు. సిద్ధం సభను విజయవంతం చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీల వెన్నులో వణుకు పుట్టించడంతోపాటు, వచ్చే ఎన్నికల్లో వైకాపాదే విజయం అని డంకా భజాయించి చాటి చెప్పాల్సిన అవసరం మనందరి పైన ఉందన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు, యూత్ లీడర్ కొట్టు విశాల్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగ్జీవన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు, వన్ టౌన్ జెసిఎస్ కన్వీనర్ కొలుకులూరి ధర్మరాజు, కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సంపత్ రావు కృష్ణారావు, పలువురు సొసైటీ చైర్మన్లు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు ఇన్చార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.