మన అందరికీ మంచి చేస్తున్న జగనన్నను ఆశీర్వదించండి

అధునాతన రైల్వే స్టేషన్, బస్టాండ్ లను తీసుకొస్తున్న గురుమూర్తికి మళ్లీ అవకాశం ఇవ్వండి

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి విజ్ఞప్తి

 సిరా న్యూస్,తిరుపతి;
మనందరికీ మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దితున్న భూమన అభినయ్ ని ఎమ్మెల్యే గా అదరించి ఓట్లు వేయాలని, తిరుపతిలో అధునాతన రైల్వే స్టేషన్, బస్టాండ్ తీసుకొస్తున్న గురుమూర్తికి ఏంపిగా మరో అవకాశం ఇవ్వాలని టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాలను స్థానిక రాయల్ నగర్, ఎల్ బీ నగర్, మునిరెడ్డి నగర్, రాజీవ్ నగర్ కాలనీల్లో నిర్వహించగా టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి ఎం.పి డాక్టర్ మద్దిల గురుమూర్తితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి భూమన కరుణాకర రెడ్డి ప్రసంగిస్తూ పేదోళ్లకు జగనన్న చేసినంత సహాయం మరెవరూ చేయలేదన్నారు.‌ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేశారని భూమన తెలిపారు. ఒక్క తిరుపతిలోనే 1,700 కోట్ల రూపాయలు అందించారని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్ని విమర్శలు చేసినా జగనన్న రాష్ట్ర బడ్జెట్ అంతా పేదలకే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. జగనన్న రాష్ట్రంలో 31లక్షల ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. తిరుపతిలోనే 24,500 ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, త్వరలోనే ఇళ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తామని ప్రకటించారు. జగనన్న ఆశీస్సుల వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. టీటీడీలో ఏడున్నర వేల మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. పారిశుధ్య కార్మికులకు ఐదు వేల రూపాయల జీతం పెంచామని భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాల్లో దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, దేవానంద్, కార్పొరేటర్లు పైడి సునీత, ఈశ్వరి, శేఖర్ రెడ్డి, అనీల్, డిష్ చంద్ర, తిమ్మారెడ్డి, బాలిశెట్టి కిశోర్, అనీల్ రాయల్, బ్రహ్మానందం, రెడ్డిరాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *