ఆదిలాబాద్, సిరా న్యూస్
రేపటి సీఎం సభను విజయవంతం చేద్దాం
ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్ లో జిల్లా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని, విజయవంతం చేయాలని మీటింగ్ ఇన్ చార్జి పటేల్ రమేష్ రెడ్డి , అసెంబ్లీ ఇన్ చార్జి కంది శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ , బేల, మండల కేంద్రాలతోపాటు రూరల్ మండలంలోని రామాయి గ్రామంలో గురువారం పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశాలలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేశారు. ముందుగా జైనథ్ లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో ఇరువురినీ సత్కరించారు. సీఎం రేవంత్రెడ్డి సభ సక్సెస్ కావాలని వేడుకోవడంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండలో పటేల్ రమేష్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
జైనథ్ మండలం కోసం ప్రత్యేకంగా ఈజీఎస్ కింద 35 లక్షలు తీసుకొస్తున్నామని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 వేల ఆధిక్యం జైనథ్ నుండే రావాలని కంది శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు సూచించారు. దురదృష్టవశాత్తు గత ఎన్నికలలో ఓడినప్పటికీ అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్దులకంటే ఎక్కువ ఓట్లు సాధించ గలిగామన్న సంతృప్తి ఉందని అన్నారు. తాను ఓడినా, గెలిచినా మీ మధ్యనే ఉంటానని, నిరంతరం నియోజకవర్గ ప్రజలకు సేవకే అంకితమవుతానని పేర్కొన్నారు. మనం అభివృద్ధి చెందాలంటే ఎంపీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని, భారీ మెజారిటీ వచ్చేలా కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా రేవంత్రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్లో చేరికల జోరు
కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. జైనథ్ మండలం మాండగడ సర్పంచ్ సైపట్ ఇందు మహేందర్రావు, పటేల్ రమేష్ రెడ్డి , కంది శ్రీనివాసరెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బేల మండలం పొనాల గ్రామ యువకులు ఉత్తమ్రావు , విజయ్, ప్రవీణ్, గంభీర్, అజయ్, లక్ష్మికాంత్, వికాస్ సైతం పార్టీ తీర్థం పుచ్చుకోగా వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి,కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,గడ్డం జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,యాల్ల పోతా రెడ్డి,మైనారిటీ నాయకులు ఎం.ఏ షకీల్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,జైనథ్ గ్రామ ఎంపీటీసీ కొడిచేర్ల సుదర్శన్,ఖప్రి సర్పంచ్ రమీల-వెంకట్ రెడ్డి,బెల్లూరి రామ్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునిగేల విట్టల్, బద్దం సురేష్ రెడ్డి,మాజీ సాత్నాల ప్రాజెక్ట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి,సోషల్ మీడియా జిల్లా కో. ఆర్డినేటర్ పుండ్రు రవి కిరణ్ రెడ్డి,అడ్డి రూకేష్ రెడ్డి,సంతోష్ రెడ్డి,కిష్టా రెడ్డి,ఎల్మ గంగా రెడ్డి,చిలుకూరి కషప్ రెడ్డి,సయ్యద్ సాబీర్,యెల్టీ ప్రదీప్ రెడ్డి,బండి కిష్టాన్న,అన్నెల సంజీవ్,ఎల్మ రామ్ రెడ్డి,రఫీక్,షేక్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.