సిరా న్యూస్,న్యూఢిల్లీ;
పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపిలు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ను కలిసారు. బీఆర్ఎస్ లోక్ సభ ప్లోర్ లీడర్ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డు తీసుకునే నిర్ణయాల వలన రాష్ట్రానికి కలిగే నష్టాల గురించి మేము కేంద్ర మంత్రికి విన్నవించామని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పుకున్నయి అని కేంద్ర మంత్రి చెప్పారు..కేఆర్ఎంబీ తీసుకునే నిర్ణయం వలన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మేము మరోసారి వివరించాం.అయినా ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నాక ఇదేందీ అని కేంద్ర మంత్రి మమ్ములనే ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తెలంగాణ ప్రజలు నష్ట పోతారు. కృష్ణ బేసిన్ లో ఉన్న జిల్లాల రైతన్నలు తీవ్రంగా నష్టపోతారని మేము స్పష్టం చేశామని అన్నారు.
భవిష్యత్ లో దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము…రేపు పార్లమెంట్ లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతామని అన్నారు. పార్లమెంట్ లో కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టు ల అప్పగింతపై మేము చర్చకు లేవనెత్తుతమని అన్నారు.