సిరా న్యూస్,వెంకటగిరి;
వెంకటగిరి నియోజకవర్గం, శానాయపాలెం గ్రామంలో కార్యకర్త సన్నిబోయిన కృష్ణయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కృష్ణయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. భువనేశ్వరిని చూసి కృష్ణయ్య కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైయారు. వారిని భువనేశ్వరి ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసారు.