బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

సిరా న్యూస్,పత్తికొండ;
సీఎం సహాయనిధి కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి చెక్కులను శుక్రవారం రోజున పత్తికొండ పార్టీ కార్యాలయం నందు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారని ఆమె తెలియజేశారు.సీఎం సహయనిధి క్రింద మంజూరైన 6 మందికి 12లక్షల రూపాయల చెక్కులనుఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బాధితులకు అందజేశారు.పత్తికొండ,తుగ్గలి,వెల్దుర్తి మండలాలలోని సీఎం సహాయనిధి కింద దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బాధితులకుఅందజేశారు.ఆరోగ్యశ్రీ క్రింద లేనటువంటి చికిత్సలు అన్నిటికీ కూడా సీఎంఆర్ఎఫ్ క్రింద దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలియజేశారు.వడ్డే జగదీష్,కురవ రామన్న, కురవ రామకృష్ణ,మద్దికేర రమణ రెడ్డి,చాకలిరాజు,బోయ మేడికుండ ఆనంద్ లకు సీఎం సహాయనిధి అందించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కు,ఎమ్మెల్యే శ్రీదేవి కు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జిట్టా నాగేష్, తుగ్గలిమండల సచివాలయాల కన్వీనర్ హనుమంతు,వైస్ ఎంపీపీ ఎర్ర నాగప్ప, ఎద్దులదొడ్డి భూపాల్ రెడ్డి మరియు తదితర తుగ్గలి,వెల్దుర్తి,క్రిష్ణగిరి మండలాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *