–సర్పంచ్ ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్,శ్రీను
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
నాగర్ కర్నూల్ జిల్లా లోని తెలకపల్లి మండలం పరిధిలోని తాళ్ళ్ పల్లీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు నేను స్వాయశక్తుల శాయ శక్తులుగా కృషి చేశానని సర్పంచ్ భాస్కర్ గౌడ్ గురువారం తాళ్లపల్లిగ్రామంలో వారి నివాస గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ మధు సమక్షంలో ప్రజలకు గుర్తు చేశారు
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల పాలన ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగాసర్పంచ్ ఉపసర్పంచులకు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు అనంతరం గ్రామ సర్పంచి మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధిలో ప్రతి ఒక్కరు ముందుండి సలహాలు సూచనలు మరియు తోడ్పాటు అందించారు అనిగ్రామాన్ని అదృష్ట స్థానంలో ఉండేందుకు ప్రజాసేవయే మార్గమని నమ్మిన వ్యక్తిని నేను అని అన్నారు గ్రామంలో అండర్ డ్రైనేజీ, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇలాంటి సమస్య తలెత్తకుండా పూర్తిస్థాయిలోపనిచేశానని అదేవిధంగా వీధి బల్బులకు అధిక ప్రాధాన్యతని ఇవ్వటం జరిగిందఅన్నారు. ప్రధానంగా గ్రామంలో పార్టీలకతీతంగా ప్రజలందరూ నా కుటుంబ సభ్యులుగా భావించుకొని అభివృద్ధిలో ముందంజలో ఉంచడంజరిగిందన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీపీ మధు మాట్లాడుతూ నిధులు సమకూర్చడం జరిగిందని భవిష్యత్తులో కూడా తాళ్లపల్లి గ్రామ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ప్రజలకువిన్నవించారు.
మాజీ ఎంపీపీ బండ పర్వతాలు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో ఒక్క ఇల్లు, రేషన్ కార్డు, కూడా ఇవ్వలేదని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పేద ప్రజల అభ్యున్నతి కోసంకృషి చేస్తుందని అందుకుగాను ప్రజలందరూ ముక్తకంఠంతో ఏకమై సమైక్యంగా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవాల్సిన అవసరం మనందరి బుజస్కంధాలపై ఆధారపడి ఉందని అన్నారు రానున్న పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంకు అందరి మద్దతు తెలిపి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా కృషి చేయాలని తద్వారా కేంద్ర, రాష్ట్రం నిధులు అధికంగా మన గ్రామానికి వస్తాయని ఇందుకు ఉదాహరణగా ప్రస్తుతంఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే నిధులు మనకు అందుతాయని ప్రజలకు తెలియజేస్తూ నేటి మన ప్రజా పాలన,ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుందనిఅందుకు ప్రజలందరి సహకారం ఉండాలని కోరారుఈ కార్యక్రమంలో ఎంపీపీ మధు, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాలె శ్రీను,తిరుపతయ్య గౌడ్, సింహయ్య, శేఖర్ గౌడ్ ,నాగరాజుగౌడ్, కావలి కృష్ణయ్య ,యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు మాధవుని శివ, నాయకులు కుమ్మరి కృష్ణ, గ్రామ పెద్దలు నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, తోక లక్ష్మయ్య,మావిళ్ళ సుధాకర్, గ్రామపంచాయతీ వెల్ఫేర్ శ్రీను, కార్బార్ రామస్వామి, బాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.