సిరా న్యూస్, ఆదిలాబాద్:
కాంగ్రేస్ గూటికి కామాయి సురేందర్ రెడ్డి…
+ కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం
+ జోగు రామన్నతో 30ఏళ్ల అనుబంధానికి బ్రేకప్
+ బీఆర్ఎస్లో గుర్తింపు లేకనే పార్టీ మారినట్లు ఆవేదన
ఆదిలాబాద్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రేస్లో వలసలు ఆగడం లేదు. రోజురోజుకు బీఆర్ఎస్ నుండి కాంగ్రేస్లో చేరుతున్న నాయకుల సంఖ్య పెరుతోంది. ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కామాయి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి సైతం కాంగ్రేస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో ఆయన కాంగ్రేస్ పార్టి కండువా కప్పుకున్నారు. గడిచిన 30సంవత్సరాలుగా మాజీ మంత్రి జోగు రామన్న వెంట నడిచిన సురేందర్ రెడ్డికి జోగు రామన్నతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే గతంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవితో పాటు, పలు పార్టీ పదవులు అశించిన సురేందర్ రెడ్డికి అనేక సార్లు భంగపాటు ఎదురైంది. కాగా జోగు రామన్న టీడీపీలో ఉన్నప్పటి నుండి తాను వెంట నడిచినప్పటికీ కూడ తనకుక పెద్దగా గుర్తింపు లేకపోవడంతోనే విసుగు చెందిన పార్టీ మారినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయమై ‘సిరా న్యూస్’ ఆయన్ను ఫోన్లో సంప్రదించగా, 30ఏళ్లుగా జోగు రామన్ననే నమ్ముకొని పనిచేస్తున్న తనకు పదవులు ఇవ్వకుండా అన్యాయం చేసారని, దీంతో విసుగు చెందిన పార్టీ మారినట్లు తెలిపారు. అటు రాష్ట్రంలో ఇటు ఆదిలాబాద్లో సైతం కాంగ్రేస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో పార్టీ ఆదేశానుసారం పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.