కుందుర్తి, సిరా న్యూస్
పరిసరాలను శుభ్రం చేసిన ఎన్ఎస్ఎస్
అనంతపురం జిల్లా కుందుర్తి మండలంలోని జంబూ గుంపల గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న గ్రామ పరిసరాలను ఎన్ఎస్ఎస్ టీం సభ్యుల ఆధ్వర్యంలో పరిశుభ్రం చేశారు రెండవ రోజు గ్రామంలో స్థానిక ఖుషి సైన్స్ అండ్ ఖుషి ఆర్టిస్ట్ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం(ఎన్ ఎస్ ఎస్) ఆధ్వరంలో కొనసాగింది. గ్రామ పరిసరాల ప్రాంతంలో ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న పరిసరాలను ఎన్ ఎస్ ఎస్ వలంటీర్లు పరిశుభ్రం చేశారు. గ్రామ చివర ఉన్న కంపచెట్లు, పిచ్చి మొక్కలు తొలగించారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధ్యాపక బృందం ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు