ఈ నెల 16న రథసప్తమి
భక్తులకు ఏ ఇబ్బంది రానియ్యవద్దు
లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం
సూర్య జయంతిన అరసవల్లిలో ఏర్పాట్లు
రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశం
రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాద రావు
సిరా న్యూస్,శ్రీకాకులం;
భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా అరసవల్లి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లూ పకడ్బంధీగా చేయాలని రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ నెల 16వ తేదీన జరగనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుక ఆహ్వాన పత్రికను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు.గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. దేశం నలు మూలల నుంచి రథసప్తమికి ఇక్కడికి వస్తారని,వారికి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని సంబంధిత ఆలయ అధికారులకు సూచించారు