సిరా న్యూస్,గోపాలపురం;
తూర్పు పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల లో తిరుగుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి తాజాగా గోపాలపురం మండలం కరిచర్ల గూడెం గ్రామ సమీపంలో ఉన్న మాతంగం మెట్ట ఫారెస్ట్ వద్ద ప్రత్యక్షమైంది… ఈరోజు ఉదయం మాతంగం మెట్ట సమీపంలో ఉన్న ఇంటి వద్ద ఉన్న కుక్కలను వేటాడేందుకు పెద్దపులి వచ్చింది.. అయితే ఆ సమయంలో కుక్కలు మొరగడంతో, ఆ ఇంటిలో అద్దే కు ఉంటున్న బీహార్ కు చెందిన మహిళ బయటకు వచ్చి చూడగా పెద్దపులి కుక్కల వద్ద కనిపించింది.. దీంతో ఆమె కేకలు వేస్తూ సమీపంలో ఉన్న ఇంటి యజమానికి సమాచారం అందించడంతో వారు పరుగు పరుగు నా అక్కడికి చేరుకొని పెద్దపులి వెన్నుతిరిగి వెళ్లడం గమనించారు… ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు పోలీసులకు తెలియజేయడంతో వారు హుటా హుటిన అక్కడికి చేరుకొని సమీపంలోనే ఫారెస్ట్ తో పాటు కరిచర్లగూడెం నందిగూడెం కరగపాడు తదితర గ్రామాల్లో ఉన్న అటవీలోసోదాలు చేస్తున్నారు…