జంగి జాతర ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సదల్ పూర్ గ్రామంలోని భైరాం దేవ్ మహదేవ్ ఆలయం దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో లో జంగి జాతర శనివారం ప్రత్యేక పూజలతో అభిషేకం చేశారు. ప్రారంభం సందర్భంగా బీజేపీ అసెంబ్లీ జిల్లా కన్వీనర్ విజయ్ బోయర్, బీజేపీ నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అక్కడున్న తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రే, దత్త నికం రాము, బర్కాడే తదితరులు పాల్గొన్నారు