MLA Payal: న్యాయవాదుల క్రికేట్‌ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్‌ శంకర్

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

న్యాయవాదుల క్రికేట్‌ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్‌ శంకర్

ఆదిలాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు, జైలు సిబ్బంది క్రీడా స్పూర్తితో క్రికేట్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. ఆదివారం బెల్లూరిలో నిర్వహించిన క్రికేట్‌ పోటీలను టాస్‌ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. సరదగా క్రికేట్‌ ఆడి క్రిడాకారుల్లో ఉత్సహాం నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… క్రీడలతోనే మానసికోల్లాసం సాధ్యమని అన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్పూర్తిని చాటేలా ఆడాలన్నారు. ఆయన వెంట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్రాల నగేష్, న్యాయవాదులు, జైలు సిబ్బంది ఉన్నారు.

సత్తాచాటిన న్యాయవాదుల టీం…
టాస్‌ గెలిచిన ఫీల్డింగ్‌ను ఎంచుకున్న న్యాయవాదుల టీం, జైలు సిబ్బంది టీంను 16 ఓవర్లలో 119 పరుగుల వద్ద కట్టడి చేసారు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యాయవాదుల జట్టు కేవలం 12 ఓవర్లలో 120 పరుగులు పూర్తి చేసి, విజయం సొంతం చేసుకుంది. ఈ పోటీలో 56 పరుగులు చేసిన న్యాయవాది అఖిలేష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *